Tuesday, April 30, 2024

అంగరంగ వైభవంగా తిరుపతి గంగమ్మ జాతర: ఎమ్మెల్యే భూమన

తిరుపతి తాతయ్య గుంట గంగమ్మ జాతర మహోత్సవాలను అంగరంగ వైభవంగా జరుపుకుందామని తిరుపతి ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి అన్నారు. మే 10 నుంచి ప్రారంభమవుతున్న తిరుపతి గంగ జాతర ఉత్సవాలను ఏ విధంగా జరుపుకోవాలనే అంశంపై తిరుపతి నగరపాలక సంస్థ కార్యాలయంలో ఎమ్మెల్యే భూమన కరుణాకర రెడ్డి,  మేయర్ డాక్టర్ శిరీష, కమిషనర్ అనుపమ అంజలితో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే భూమన మాట్లాడుతూ ఎంతో విశిష్టత కలిగిన తిరుపతి గంగ జాతర వారం రోజులు పెద్ద ఎత్తున జరుగుతుందన్నారు. గత రెండు సంవత్సరాలుగా కరోనా కారణంగా జాతర ఉత్సవాలు జరపలేక పోయామన్నారు. ఇప్పుడు జరిగే జాతర అంగరంగ వైభవంగా పెద్ద ఎత్తున జరిపేందుకు అందరూ ముందుకురావలన్నారు. జాతర రోజు తన ఇంటి నుంచి అమ్మవారికి సారెను తీసుకురానున్నట్లు చెప్పారు. ప్రతి ఒక్క కార్పోరేటర్ తన ఇంటి నుంచి జాతర ఉత్సవాల్లో అమ్మవారికి సారెను సమర్పించేందుకు సంసిద్ధత వ్యక్తం చేయడం అభినందనీయమన్నారు. తిరుపతిలోని 20 ముఖ్య సెంటర్లలో అమ్మ వారి విగ్రహాలను ఏర్పాటు చేయాలన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement