Tuesday, April 30, 2024

నేను క్షేమంగా ఉన్నా: విద్యార్థిని జయలక్ష్మి ప్రకటన

అనంతపురంలో జరిగిన పోలీసుల లాఠీఛార్జ్‌లో గాయపడ్డ SSBN కాలేజీ విద్యార్థిని జయలక్ష్మి అదృశ్యం కావడం కలకలం రేపిన సంగతి తెలిసిందే. అయితే, తాను క్షేమం ఉన్నట్లు విద్యార్థిని జయలక్ష్మి తెలిపింది. లాఠీఛార్జ్ లో తలకు గాయం కావడంతో ఆస్పత్రికి వెళ్లి చికిత్స తీసుకున్నట్లు తెలిపింది. అనంతరం ఇంట్లో రెస్ట్ తీసుకున్నానని, తన మెబైల్ లో ఛార్జింగ్ లేకపోవడంతో ఎవరితో మాట్లాలేదని తెలిపింది. ప్రస్తుతం తన బంధువుల ఇంట్లో తాను క్షేమంగా ఉన్నట్లు చెప్పింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement