Friday, May 3, 2024

జగన్ దయతో రఘురామకు ఎంపీ పదవి: మంత్రి వనిత

రఘురామకృష్ణంరాజుపై ఏపీ రాష్ట్ర స్త్రీ, శిశు సంక్షేమ శాఖ మంత్రి తానేటి వనిత తీవ్రంగా ఫైర్ అయ్యారు. నరసాపురం ఎంపీగా రఘురామకృష్ణం రాజుకు గెలిచారంటే అది ముఖ్యమంత్రి జగన్ పెట్టిన భిక్ష అని ఆమె అన్నారు. సీఎం జగన్ దయతో, ఆయన పెట్టిన బిక్షతోనూ ఎంపీగా గెలుపొంది పార్టీకి, ప్రభుత్వానికి వ్యతిరేకంగా పనిచేయడం కరెక్ట్ కాదని ఆమె పేర్కొన్నారు. మాట్లాడే భాష, తీరు, వ్యవహరించే విధానం  ప్రజాప్రతినిధికి ఉండాల్సిన లక్షణం ఒక్కటీ ఆయనకు లేదన్నారు. ఎంపీగా గెలిచి రెండేళ్లు కావొస్తున్నా ఆయన ప్రజలకోసం చేసిందేమీ లేదని విమర్శించారు. కరోనా సమయంలో ప్రజలకు అండగా ఉండాల్సిన ఆయన.. అన్నీ గాలికొదిలేసి ప్రభుత్వాన్ని, పార్టీని విమర్శించడమే పనిగా పెట్టుకున్నారని మండిపడ్డారు. తెలుగుదేశం వాళ్ళు రాసిచ్చిన స్క్రిప్ట్ పట్టుకుని ఎక్కడబడితే అక్కడ తన స్థాయిని మరచి ఎలాబడితే అలా మాట్లాడుతున్నారని పేర్కొన్నారు. ఎంపీ రఘురామకృష్ణంరాజు అరెస్ట్‌ను తామంతా సమర్థిస్తున్నట్లు మంత్రి వనిత తెలిపారు. ఇటువంటి వ్యక్తుల విషయంలో చట్టం తనపని తాను చేసుకుపోతుందన్నారు. ఈ విషయం ఆయన్ను సమర్థిస్తున్న వాళ్ళు కూడా తెలుసుకోవాలి మంత్రి తానేటి వనిత హితవు పలికారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement