Friday, April 26, 2024

బీజేపీ, టీడీపీలపై మంత్రి సత్యనారాయణ ఫైర్

బీజేపీ, టీడీపీలపై ఏపీ మంత్రి కొట్టు సత్యనారాయణ ఫైర్ అయ్యారు. వినాయక చవితి ఉత్సవాలపై అనవసరంగా రాద్ధాంతం చేస్తున్నారన్నారు. బీజేపీ నేతలు నోటికి ఏదొస్తే అది మాట్లాడడం సరికాదన్నారు. బీజేపీ విమర్శలకు టీడీపీ వంతపాడటం సిగ్గుచేటన్నారు. కేవలం ఫైర్, పోలీసు పర్మీషన్లకు మాత్రమే నామమాత్రం రుసుం అన్నారు. భగవంతుడి కార్యక్రమాలు స్నేహపూరిత వాతావరణంలో జరుపుకోవాలన్నారు. దేవుడి పేరుతో రాజకీయం చేయడం మంచి పద్దతి కాదన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement