Sunday, May 19, 2024

AP | మాజీ మంత్రి బండారు పై మంత్రి రోజా పరువునష్టం దావా

నగరి (రాయలసీమ ప్రభన్యూస్ బ్యూరో ) : తన ప్రతిష్ట ను దెబ్బ తీసే విధంగా వ్యాఖ్యలు చేసిన మాజీ మంత్రి బండారు సత్యనారాయణ రావు పై రాష్ట్ర మంత్రి ఆర్ కే రోజా ఈరోజు పరువునష్టం దావా వేశారు. తెలుగుదేశం పార్టీ పై విమర్శల, ఆరోపణలతో దాడి చేస్తున్న మంత్రి రోజా పై నెల రోజుల క్రితం బండారు సత్యనారాయణ రావు అసభ్య కర మైన విమర్శలు చేయడం సంచలన దుమారానికి దారితీసిన విషయం తెలిసిందే.

రోజాకు మద్దతుగా ఇటు అధికార వై ఎస్సార్ కాంగ్రెస్ నాయకులతో పాటు సినీ రంగ ప్రముఖులు కూడా ఖండించారు.ఈ నేపథ్యంలో మాజీమంత్రి బండారు పై మంత్రి రోజా పరువునష్టం దావా వేశారు. చిత్తూరు జిల్లా నగరి కోర్టులో ఆమె క్రిమినల్ డిఫమేషన్ పిటిషన్ దాఖలు చేసారు. మాజీ మంత్రి బండారు తో పాటు నగరి టీడీపీ ఇంచార్జ్ గాలి భానుప్రకాశ్, ఒక టి వి యజమాని రాజేంద్రప్రసాద్ పైనా పిటిషన్ వేశారు. ఆమె దాఖలు చేసిన మ పిటిషన్ ని స్వీకరించిన కోర్టు ఈరోజు మంత్రి రోజా స్టేట్ మెంట్ నమోదు చేసుకున్నది.

Advertisement

తాజా వార్తలు

Advertisement