Sunday, May 5, 2024

అత్యాధునిక హంగులతో ఆత్మకూరు బస్ స్టాండ్ : మంత్రి మేకపాటి

పరిశ్రమల శాఖ మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి కషితో ఆత్మకూరు బస్టాండ్ రూపురేఖలు మారనున్నాయి. ఏషియన్ పెయింట్స్ లిమిటెడ్ పరిశ్రమ అందించే కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ (సామాజిక బాధ్యత) నిధుల ద్వారా బస్ స్టాండ్ ని అభివద్ధి చేయనున్నట్లు మంత్రి మేకపాటి వెల్లడించారు. రూ.1.5 కోట్ల సీఎస్ఆర్ నిధులతో బస్ స్టాండ్ సహా చుట్టు పక్కల చిరు వ్యాపారులకు దుకాణాలు కూడా నిర్మించనున్నారు. ఇప్పటికే పనులు మొదలైన బస్ స్టాండ్ ను అత్యాధునిక హంగులతో తీర్చిదిద్దాలని మున్సిపల్ కమిషనర్ రమేష్ బాబుకు మంత్రి మేకపాటి ఆదేశించారు. వేగవంతంగా నిర్మాణ పనులు పూర్తి చేసి నియోజకవర్గ  ప్రజలకు అందుబాటులో తీసుకురావాలని మంత్రి స్పష్టం చేశారు.

ఇది కూడా చదవండి: Corona: తెలంగాణలో కరోనా కొత్త వేరియంట్.. తస్మాత్ జాగ్రత్త

Advertisement

తాజా వార్తలు

Advertisement