Thursday, May 2, 2024

AP: చంద్ర‌బాబు పై మంత్రి కాకాణి ఫైర్

నెల్లూరు: టీడీపీ అధినేత చంద్రబాబుపై మంత్రి కాకాణి గోవర్ధన్‌ రెడ్డి ఫైర్ అయ్యారు. రైతులను చంద్రబాబు ఏనాడూ పట్టించుకోలేదన్నారు. నెల్లూరులో మంత్రి కాకాణి ఆదివారం మీడియాతో మాట్లాడుతూ.. వ్యవసాయాన్ని కించపరిచేలా మాట్లాడిందే చంద్రబాబు అంటూ తీవ్ర విమర్శలు చేశారు. వ్యవసాయం దండగ అన్న వ్యక్తి చంద్రబాబు. 14 ఏళ్లలో వ్యవసాయానికి చంద్రబాబు తీసుకున్న చర్యలు ఏంటీ? అన్నారు. రైతులను చంద్రబాబు ఏనాడూ పట్టించుకోలేదన్నారు. విపత్తుల సమయంలో వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం ప్రజలకు అండగా నిలిచిందన్నారు.

విపత్తు కాలంలో రైతాంగానికి అన్ని విధాలా అండగా నిలిచామ‌న్నారు. రాష్ట్రంలో తుపాన్‌, వరదల నేపథ్యంలో ప్రజాప్రతినిధులు, అధికారులు సకాలంలో స్పందించారు. సమస్యాత్మక గ్రామాలను ముందుగానే గుర్తించి తగిన ఏర్పాట్లు చేపట్టగలిగామ‌న్నారు. ఎక్కడా ఎలాంటి ఇబ్బందులు లేకుండా చేశామ‌న్నారు. విద్యుత్ విషయంలో అపారమైన నష్టం జరిగినా యుద్ధప్రాతిపదికన పునరుద్ధరణ చేపట్టామ‌న్నారు. గత రెండు రోజులుగా ప‌ర్య‌టిస్తున్న‌ చంద్రబాబు.. ఎక్కడా ప్రభుత్వం ఏవిధంగా విఫలమైందో స్పష్టంగా చెప్పలేక పోయారన్నారు. గతంలో రైతులను చంద్రబాబు అవమానకరంగా మాట్లాడారన్నారు. ప్రభుత్వానికి మంచి పేరు వస్తుంటే చంద్రబాబుకు కడుపు మంట అన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement