Friday, April 19, 2024

ఫ్యామిలీ ఫిజీషియన్ వాహనాలను ప్రారంభించిన మంత్రి జయరాం

కర్నూలు: ఫ్యామిలీ ఫిజీషియన్ విధానంలో వైద్య సేవలు అందించేందుకు ప్రభుత్వం మంజూరు చేసిన 16 కొత్త వాహనాలను రాష్ట్ర కార్మిక శాఖా మంత్రి గుమ్మనూరు జయరాం సోమవారం కర్నూల్ లో జెండా ఊపి ప్రారంభించారు. అనంతరం స్థానిక రాజ్ విహార్ సెంటర్ నుంచి కొండారెడ్డి బురుజు మీదుగా వాహనాలను ర్యాలీ నిర్వహించారు. ప్రభుత్వ ఆసుపత్రి కూడలిలో 104 అంబులెన్స్ వాహనాలు ర్యాలీగా తిరిగి వెళ్లాయి. ఈ కార్యక్రమంలో పాణ్యం శాసనసభ్యులు కాటసాని రాంభూపాల్ రెడ్డి, కోడుమూరు శాసనసభ్యులు జె.సుధాకర్, మేయర్ బివై.రామయ్య, స్థానిక సంస్థల ఎమ్మెల్సీ మధుసూధన్, జిల్లా కలెక్టర్ పి.కోటేశ్వర రావు, జాయింట్ కలెక్టర్ ఎస్.రామ్ సుందర్ రెడ్డి, కర్నూలు మున్సిపల్ కమీషనర్ భార్గవ్ తేజ, డీఎంహెచ్ఓ రామ గిడ్డియ్య, తదితరులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement