Sunday, April 28, 2024

Memu Siddham – మండుటెండలో జన కడలి – బస్సుపై నుంచి జగన్ అభివాదం

(ఆంధ్రప్రభ స్మార్ట్, కాకినాడ ప్రతినిధి) : సీఎం వైఎస్ జగన్ చేపట్టిన మేమంతా సిద్ధం బస్సు యాత్రకు జనం బ్రహ్మరథం పట్టారు. మండు టెండలో నడినెత్తిన వేసవి సెగ.. మరో వైపు దాహంతో తల్లడిల్లుతున్నా… వేసవి భగభగలను లెక్క చేయకుండా కాకినాడ జిల్లా ప్రజలు సీఎం జగన్ వెంట కదం తొక్కారు. మిట్ట మధ్యాహ్నం సైతం అవ్వలు, తాతలు, అక్కలు, చెల్లెళ్లు ఎక్కడ తగ్గలేదు. బైకులపై కుర్రకారు గంతులు వేశారు. రంగం పేట, పెద్దాపురం ప్రాంతాల్లో మహిళలు హారతులు పట్టారు. ప్లెక్సీలతో స్వాగతం పలికారు. బస్సుపై ఎక్కిన సీఎం జగన్ అభివాదం చేశారు. ఎక్కడ చూసిన జన సంద్రం కనిపిస్తోంది.

వైసీపీలో జనసేన నాయ‌కుల చేరిక
కాకినాడ జిల్లా రాజానగరం నియోజకవర్గం ఎస్.టి.రాజపురంలో సీఎం జగన్ సమక్షంలో నెల్లూరు జిల్లా జనసేన అధ్యక్షుడు చెన్నారెడ్డి మనుక్రాంత్ రెడ్డి, నెల్లూరు మండల అధ్యక్షుడు కాటంరెడ్డి జగదీష్ రెడ్డి, జనసేన జిల్లా ప్రధాన కార్యదర్శి ప్రవీణ్ కుమార్ యాదవ్, టీడీపీ ఉదయగిరి మండల మాజీ ఎంపీపీ చేజెర్ల సుబ్బారెడ్డి వైసీపీలో చేరారు. ఈ కార్యక్రమంలో నెల్లూరు ఎంపీ అభ్యర్థి వి విజయసాయిరెడ్డి, నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే అభ్యర్థి ఆదాల ప్రభాకరరెడ్డి పాల్గొన్నారు.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement