Thursday, May 2, 2024

Nandyal : భారీ దోపిడీ… కారులో రూ.4కోట్లు ఎత్తుకెళ్లిన దుండగులు

నంద్యాల : కారులో ఉన్న రూ.4కోట్లను దుండగులు ఎత్తుకెళ్లిన ఘటన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చోటుచేసుకుంది. నంద్యాల జిల్లా డోన్ సమీపంలో భారీ దోపిడి ఘటన వెలుగు చూసింది. రూ.4 కోట్ల రూపాయలు దోచుకెళ్లారు దుండగులు. గత నెల 28వ తేదీ భారీ దోపిడి జరిగింది. హైదరాబాద్ నుంచి బెంగళూరుకు రూ.4 కోట్లతో కియా కారులో వెడుతుండగా.. ఆత్మకూరు సమీపంలో కారును ఆపి, కారులోని వ్యక్తులను దింపి, కారుతో సహా పరారయ్యారు.

వెంటనే వీరు డోన్ పోలీసులకు మౌఖికంగా తెలిపారు. వారు రహస్యంగా విచారణ చేపట్టారు. బాధితులు గుజరాత్, భావ్ నగర్ కి చెందిన వారిగా సమాచారం. అయితే దోపిడీ జరిగిన ఇన్ని రోజులకు ఇది వెలుగుచూసింది. అయితే దీనిమీద బాధితులు కానీ, పోలీసులు కానీ నోరు మెదపడం లేదు. డబ్బులు దోచుకుని కియా కారులో వెళ్లిన నిందితులు కియా కారును ఆత్మకూరు సమీపంలో వదిలి వెళ్లారు. దీంతో విషయం వెలుగు చూసింది. దీనికి సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement