Monday, April 29, 2024

AP: రాయలసీమ ఫోర్త్ జోన్ లో భారీగా పోలీస్ బదిలీలు…కమిషనర్ ఉత్తర్వులు జారీ

క‌ర్నూల్ః రాయలసీమ ఫోర్త్ జోన్ లో భారీగా పోలీస్ బదిలీలయ్యాయి. రాయలసీమ ఫోర్త్ జోన్ప రిధిలో 91 మంది సీఐలు, 85 మంది ఎస్ఐలను బదిలీ చేస్తూ ఆ శాఖ కమిషనర్ రవి ప్రకాష్ ఉత్తర్వులు జారీ చేశారు.

రాయలసీమ జోన్ లోని ముఖ్యంగా కర్నూలు, నంద్యాల, కడప, అన్నమయ్య చిత్తూరు, అనంతపురం సత్యసాయి జిల్లాల పరిధిలో ఈ బదిలీలు జరిగాయి. రానున్న ఎన్నికల నేపథ్యంలో ఎన్నికల కమిషన్ నిబంధన మేరకు ఈ బదిలీలు చోటు చేసుకున్నాయి. కర్నూలు జిల్లాకు సంబంధించి 18 మంది సీఐలు, 23 మంది ఎస్సైలకు స్థాన చలనం కలిగింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement