Sunday, May 5, 2024

Alert : ఏపీలో పలు రైళ్లు రద్దు

అమరావతి, ప్ర‌భ‌న్యూస్‌: ఆంధ్రప్రదేశ్ లో పలు రైళ్లు రద్దు చేసినట్లు దక్షిణ మధ్య రైల్వే తెలిపింది. భద్రతా ఏర్పాట్లలో భాగంగా ఈ నెల 20 నుంచి 26 వరకు రద్దు చేసినట్లు పేర్కొంది. కాకినాడ-విశాఖ, విశాఖ-కాకినాడ ప్యాసింజర్, గుంటూరు-రాయగడ ప్యాసింజర్, విజయవాడ-విశాఖ ప్యాసింజర్ స్పెషల్, విశాఖ-విజయవాడ ప్యాసింజర్ స్పెషల్, బందరు-విశాఖ, విశాఖ-బందరు, గుంటూరు-విశాఖ, విశాఖ-గుంటూరు, విశాఖ-రాజమండ్రి, రాజమండ్రి విశాఖ రైళ్లు రద్దు చేసినట్లు వెల్లడించింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement