Saturday, April 27, 2024

శ్రీవారి సేవలో విష్ణు ప్యానెల్.. రాజీనామాలపై కీలక వ్యాఖ్య

‘మా’ iఎన్నికల్లో గెలుపొందిన మంచు విష్ణు ప్యానెల్ సభ్యులు తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. సినీ నటులు మోహన్ బాబు, మంచు విష్ణు, మంచు లక్ష్మి, బాబూ మోహన్ స్వామి వారిని దర్శించుకున్నారు. సోమవారం ఉదయం వీఐపీ ప్రారంభ దర్శన సమయంలో విష్ణు ప్యానల్​తో కలసి స్వామివారి సేవలో పాల్గొన్నారు. మా ఎన్నికల్లో గెలుపొందడంతో స్వామివారికి మొక్కులు చెలించుకున్నామన్నారు. ప్రకాష్ రాజ్ ప్యానెల్ సభ్యులు రాజీనామా విషయంపై స్పందించిన విష్ణు.. ఆ విషయం తమకు మీడియా ద్వారా తెలిసిందన్నారు. రాజీనామాలపై ఎలాంటి లేఖలు అందలేదని.. లేఖలు అందితే స్పందిస్తామని విష్ణు చెప్పారు.

ఇది కూడా చదవండి: మాడ్వి హిడ్మా తెలంగాణలోకి ప్రవేశం?

Advertisement

తాజా వార్తలు

Advertisement