Thursday, April 25, 2024

బైక్ ను ఢీకొట్టిన కారు.. వ్యక్తి మృతి

కృష్ణా జిల్లా ఉంగుటూరు మండలం పెద్ద అవుటపల్లి జాతీయ రహదారిపై సోమవారం రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో ఒకరు మృతి చెందారు. బైక్‌ను కారు ఢీకొనడంతో బైక్‌పై ప్రయాణిస్తున్న ఒకరు అక్కడికక్కడే మృతి చెందగా..మరొకరి పరిస్థితి విషమంగా ఉంది. క్షతగాత్రులను మెరుగైన వైద్యం కోసం విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. మృతుడు గుంటూరు జిల్లా కొల్లూరు గ్రామానికి చెందిన సాయికుమార్‌గా గుర్తించారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement