Friday, May 3, 2024

తెలుగువారు గర్వించదగ్గ క్రీడాకారిణి మల్లీశ్వరి..

అంబాజీపేట, (ప్రభన్యూస్): తెలుగు జాతి గర్వించదగ్గ క్రీడాకారిణి కరణం మల్లీశ్వరి అని ప్రముఖ సామాజిక, రాజకీయ విశ్లేషకులు నేలపూడి స్టాలిన్ బాబు అన్నారు. ఢిల్లీ క్రీడా విశ్వవిద్యాలయ వైస్ ఛాన్స్ లర్ గా నియమితులైన మల్లీశ్వరిని గురువారం న్యూఢిల్లీలోని ఆమె కార్యాలయంలో కలిసి అభినందించారు.

దేశంలోనే అరుదైన అవకాశం దక్కించుకున్న మల్లీశ్వరి తెలుగు వారికి కీర్తికిరీటంగా నిలిచారని స్టాలిన్ పేర్కొన్నారు. క్రీడా ప్రపంచంలో భారత క్రీడాకారులు పతకాలు సాధించేందుకు మల్లీశ్వరిని ఆదర్శంగా తీసుకోవాలని అందుకు ఆమె తోడ్పడగలదని ఆశాభావాన్ని వ్యక్తం చేసారు. తెలుగు రాష్ట్రలలో కూడా ఆమె సేవలను వినియోగించుకోవాలని స్టాలిన్ బాబు సూచించారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. రియల్ టైమ్ న్యూస్ అప్ డేట్స్ కోసం.. ప్రభన్యూస్ ఫేస్‌బుక్‌, ట్విట‌ర్ పేజీల‌ను ఫాలో అవ్వండి
https://twitter.com/AndhraPrabhaApp, https://www.facebook.com/andhraprabhanewsdaily

Advertisement

తాజా వార్తలు

Advertisement