Saturday, April 20, 2024

Breaking : ఆర్టీసీ బస్సును ఢీకొన్న ఇన్నోవా..5గురికి గాయాలు..

ఆర్టీసీ బ‌స్సును ఢీకొంది ఇన్నోవా కారు. ఈ ఘ‌ట‌న‌లో 5 గురికి గాయాలు అయ్యాయి. క్ష‌త‌గాత్రుల‌ను పీలేరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. పీలేరు-తిరుపతి రహదారిలోని ప్రభుత్వ ఐటీఐ కళాశాల వద్ద ఈ సంఘ‌ట‌న చోటు చేసుకుంది. ముందు వెళుతున్న లారీని అధిగ‌మించ‌బోయి ఆర్టిసి బస్సు ను డీ కొనడంతో ప్రమాదం జ‌రిగింది. పులివెందుల నుండి తిరుపతికి వెళుతున్న ఇనోవా కారులోని 5 గురికి తీవ్ర గాయాలు. రెండు కిలోమీటర్ల వరకు ట్రాఫిక్ జామ్ అయింది. పీలేరు పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని కేసు న‌మోదు చేసుకున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement