Monday, March 25, 2024

Srisailam | కన్నులపండువగా మల్లన్న రథోత్సవం.. భారీగా తరలివచ్చిన భక్తులు

శ్రీశైలంలో మల్లన్న బ్రహ్మోత్సవాలు కనుల పండువలా సాగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా బుధవారం స్వామి వారు భ్రమరాంబ అమ్మవారితో కలిసి రథంపై శ్రీశైల వీధుల్లో విహరిస్తూ భక్తులను అనుగ్రహించారు. రథోత్సవాన్ని తిలకించేందుకు వివిధ ప్రాంతాల నుంచి భక్తులు వచ్చారు. ప్రధాన ఘట్టమైన రథోత్సవానికి దాదాపు లక్షలాది మంది వీక్షించినట్లు అంచనా. మంగళవాయిద్యాలు, ఢమరుకనాదాలతో అశేష జనవాహిని మధ్య రథోత్సవం నయనానందకరంగా సాగింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement