Thursday, April 25, 2024

ఏపీలో కొవిడ్ బాధితులకు మహీంద్రా గ్రూప్ సాయం

ఆంధ్రప్రదేశ్ లో కరోనా బాధితులకు మహీంద్రా గ్రూప్ భారీ సహాయం ప్రకటించింది. కొవిడ్ బాధితులకు మహీంద్రా అండ్ మహీంద్రా గ్రూపు రూ.4 కోట్ల విలువైన సాయాన్ని అందించనుందని స్టేట్ కొవిడ్ నోడల్ ఆఫీసర్ డాక్టర్ అర్జా శ్రీకాంత్ తెలిపారు. మహీంద్రా అండ్ మహీంద్రా గ్రూపు ఈ నిధులతో రాష్ట్రంలో రెండు ఆక్సిజన్ ప్లాంట్లను నిర్మించనుంది. విశాఖపట్నంలో 500 ఎల్పీఎం ఆక్సిజన్ ప్లాంట్ నిర్మాణం, కర్నూలులో 1000 ఎల్పీఎం ఆక్సిజన్ ప్లాంట్ నిర్మాణాన్ని చేపట్టనున్నది. పశ్చిమ గోదావరి జిల్లాకు 10 ఆక్సిజన్ కాన్సంట్రేటర్లు, చిత్తూరు, తూర్పుగోదావరి జిల్లాలకు రెండు అంబులెన్స్ లు అందించనున్నదని నోడల్‌ అధికారి అర్జా శ్రీకాంత్‌ తెలిపారు. 

Advertisement

తాజా వార్తలు

Advertisement