Friday, April 26, 2024

లారీ ని ఢీకొట్టిన కారు ఇద్దరు మృతి..

వనపర్తి జిల్లాలోని కొత్తకోట మండలంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఓ కారు లారీని ఢీ కొట్టిన ఘటనలో ఇద్దరు మృతి చెందారు. కొత్తపేట మండలంలోని ముమ్మళ్లపల్లి ఫ్లై ఓవర్ వద్ద అతివేగంగా దూసుకొచ్చిన ఓ కారు.. లారీని వెనుక నుంచి ఢీకొట్టింది. దీంతో కారులో ప్రయాణిస్తున్న ఇద్దరు అక్కడికక్కడే మృతిచెందారు. ప్రమాద ధాటికి కారు నుజ్జునుజ్జు అయ్యింది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. మృతులను ఆంధ్రప్రదేశ్‌లోని అనంతపురం జిల్లాకు చెందిన ఆనంద్‌, నూర్‌ అహ్మద్‌గా గుర్తించారు. ఈ ప్రమాదం సోమవారం తెల్లవారుజామున 3 గంటల ప్రాంతంలో జరిగిందని చెప్పారు. కారు అతివేగంగా రావడంతోపాటు డ్రైవర్‌ నిత్రమత్తు వల్ల ముందు వెళ్తున్న లారీని ఢీకొట్టిందని కొత్తకోట పోలీసులు తెలిపారు. ఈ ఘటనపై కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement