Monday, April 29, 2024

Flash: తెలుగురాష్ట్రాల్లో వరుస ప్రమాదాలు.. లారీలు బోల్తా పడి చెలరేగిన మంటలు..

ఏపీలోని కృష్ణా తెలంగాణలోని ఆదిలాబాద్ జిల్లాల్లో వేర్వేరు ప్రమాదాలు జరిగాయి. కృష్ణా జిల్లా బొమ్ములూరు దగ్గర లారీ బోల్తా పడింది. డివైజర్ ను ఢీకొట్టడంతో లారీలో మంటలు చెలరేగాయి. దీంతో కంటైనర్ లోని సరుకు పూర్తిగా దగ్ధం అయింది. కంటైనర్ అమెజాన్ కు చెందిందిగా గుర్తించారు. సరుకు పూర్తిగా మంటల్లో కాలి బూడిదైంది. అయితే, డ్రైవర్ మాత్రం సురక్షితంగా బయటపడ్డాడు.

ఇక, ఆదిలాబాద్ లోని NH44 జాతీయ రహదారిపై ప్రమాదం జరిగింది. కొబ్బరి బోండాల లారీ అదుపుతప్పి బోల్తా పడింది. దీంతో రోడ్డుపై కొబ్బరి బోండాలు చెల్లాచెదురుగా పడ్డాయి. దీంతో భారీగా ట్రాఫిక్ స్తంభించింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement