Monday, April 29, 2024

అమరావతి టౌన్‌ షిప్‌ లో 324 ప్లాట్లకు ఈ – వేలం… రేపే లాస్ట్ డేట్

అమరావతి, ఆంధ్రప్రభ: తాడేపల్లి-మంగళగిరి కార్పొరేషన్‌ పరిధిలో అమరావతి టౌన్‌షిప్‌లో 13 లాట్లలో ఉన్న 324 ప్లాట్ల రిజిస్ట్రేషన్‌ గడువు నేటితో ముగియనుంది గత కొద్దిరోజులుగా సీఆర్డీఏ ఈ – ఆక్షన్‌ ద్వారా ప్లాట్ల అమ్మకాలు జరుపుతోంది. ఇందులో భాగంగా ఈనెవ 9వ తేదీ గురువారం ఉదయం 11 గంటల నుంచి కొనుగోలు పోర్టల్‌ ద్వారా దరఖాస్తులు స్వీకరిస్తోంది. మంగళవారం సాయంత్రం 5 గంటల వరకు దరఖాస్తులు సమర్పించేందుకు అవకాశం కల్పించామని ఏపీసీఆర్డీఏ కమిషనర్‌ వివేక్‌ యాదవ్‌ ఓ ప్రకటనలో తెలిపారు. ఈనెల 30వ తేదీ గురువారం ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఈ- వేలం నిర్వహిస్తామన్నారు. 13 లాట్లలో ఉన్న ప్లాట్లకు ఆంధ్రప్రదేశ్‌ రియల్‌ ఎస్టేట్‌ రెగ్యులేటరీ అథారిటీ-(ఏపీ రెరా) రిజిస్ట్రేష్రన్‌ సౌలభ్యాన్ని ఏపీసీఆర్డీఏ చేయించిందని పేర్కొన్నారు. ప్లాట్లు కొనుగోలు చేసిన వారికి ఎలాంటి ఇబ్బందులు లేకుండా రేరా పరిధిలో రిజిస్ట్రేష్రన్‌ చేయించామని తెలిపారు.

సీఆర్డీఏ నిర్ణయించిన ధరలకు కొనుగోలుచేసే ఔత్సాహికులు మంగళవారం సాయంత్రం లోగా తమ దరఖాస్తులను సమర్పించాలని రూ.1180 ఆన్‌లైన్‌లో చెల్లించాలని కమిషనర్‌ వివరించారు. 28వ తేదీ సాయంత్రం 5 గంటలతో దరఖాస్తుల గడువు ముగియనుందని చెప్పారు. ఈ – ఆక్షన్‌ ఈనెల 30న ఉదయం 10 నుండి సాయంత్రం 5గంటల వరకు నిర్వహిస్తామని తెలిపారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి.

Advertisement

తాజా వార్తలు

Advertisement