Monday, May 6, 2024

KNL : తోటికోడళ్లను హత్యచేసిన మామ అరెస్ట్..

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని కర్నూలు జిల్లాలోని ఓర్వకల్ మండలం నన్నూర్ గ్రామంలో ఇటీవలే తోటికోడళ్లు హత్యకు గురైన విషయం తెలిసిందే. అయితే వాళ్లను చంపింది ఎవరో కాదు.. వాళ్ల మామే. కోడళ్లను హత్య చేసిన కేసులో మామ గోగన్నను పోలీసులు అరెస్ట్ చేశారు.

కర్నూలులో తోడికోడళ్ల హత్య కేసు మిస్టరీని ఛేదించారు పోలీసులు. వారి భర్తలు..తండ్రితో కలిసి వారిద్దరిని హత్య చేసినట్లుగా నిర్ధారణ అయ్యింది. దీంతో పోలీసులు మృతుల భర్తలైన పెద్ద గోవిందు, చిన్నగోవిందు, వారి తండ్రి గోగన్నలను అరెస్ట్ చేశారు. గోగన్న కుటుంబానికి రూ.20 కోట్లు విలువ చేసే ఆస్తులున్నాయి. కానీ ఇంటి కోడళ్లకు పిల్లలు పుట్టలేదు. దీంతో వారసులు లేరని వారి భర్తలు ఇద్దరు తమ తండ్రితో కలిసి తోడికోడళ్లను హత్య చేసినట్లుగా తేలిందని పోలీసులు తెలిపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement