Sunday, April 28, 2024

కర్నూలులో సాఫీగా పదవ తరగతి పరీక్షలు

కర్నూలు జిల్లాలో పదవ తరగతి పరీక్షలు సాఫీగా జరుగుతున్నాయని జిల్లా కలెక్టర్ పి.కోటేశ్వరరావు తెలిపారు. బుధవారం కల్లూరు మండలం పెద్దపాడు గ్రామంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాల, ఏపీ మోడల్ స్కూల్ లో పదవ తరగతి పరీక్ష కేంద్రాలను జిల్లా కలెక్టర్  ఆకస్మికంగా పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. పరీక్ష కేంద్రాల్లోకి మొబైల్ ఫోన్లు, ఎలక్రానిక్ పరికరాలను ఎట్టి పరిస్థితుల్లోనూ అధికారులను ఆదేశించారు. పదవ తరగతి పరీక్షల నిర్వహణలో ఏ ఒక్క అవాంఛనీయ సంఘటన జరగకూడదని సూచించారు. మాల్ ప్రాక్టీస్ కు  పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. విధి నిర్వహణలో అప్రమత్తంగా ఉండాలని, తప్పులు చేసిన వారిపై కేసులు నమోదు చేస్తామని కఠిన చర్యలు తీసుకుంటామని కలెక్టర్ హెచ్చరించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement