Sunday, April 28, 2024

రేపటి నుంచి శ్రీశైలం ఆలయ దర్శన వేళల్లో మార్పులు

ఏపీలో జూలై 1 నుంచి కర్ఫ్యూ వేళల్లో మార్పులు చేయడంతో శ్రీశైలంలోనూ దర్శన వేళల్లో అధికారులు మార్పులు చేశారు. జులై 1వ తేదీ నుండి ఉదయం 6 గంటల నుండి మధ్యాహ్నం 3:30 గంటల వరకు తిరిగి సాయంత్రం 6 గంటల నుండి రాత్రి 8 గంటల వరకు భక్తులను దర్శనాలకు అనుమతించడం జరుగుతుందని ఆలయ ఈవో కెఎస్‌ రామారావు తెలిపారు. మధ్యాహ్నం 3:30 నుంచి సాయంత్రం 6 గంటల వరకు ఆలయశుద్ధి, శ్రీస్వామిఅమ్మవార్లకు సాయంకాలపు పూజలు నిర్వహిస్తామన్నారు. రాత్రి 9 గంటలకు ఆలయ ద్వారాలు మూసివేయనున్నట్లు చెప్పారు. ఆన్‌లైన్‌ ద్వారా నిర్వహించబడే పరోక్ష సేవలన్నీ కూడా యథావిధిగా కొనసాగనున్నట్లు వెల్లడించారు. భక్తులు మాస్కులు ధరించడం, భౌతికదూరం పాటించడం వంటి నిబంధనలను తప్పనిసరిగా పాటించాలని సూచించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement