Saturday, May 4, 2024

మహిళ పై అత్యాచారం.. ఏడేళ్ల జైలు శిక్ష

ఆత్మకూరు రూరల్ : నంద్యాల జిల్లా ఆత్మకూరు మండల పరిధిలోని కరివేన గ్రామానికి చెందిన ఎం.బాలరాజు అనే ముద్దాయికి మహిళపై అత్యాచారం కేసులో ఏడు సంవత్సరాలు జైలు శిక్ష విధించిన‌ట్లు ఎస్సై కృష్ణమూర్తి పేర్కొన్నారు. వివరాలు ఇలా ఉన్నాయి ఆత్మకూరు పోలీసు స్టేషన్ పరిధిలో 13.09.2022న కరివేన గ్రామానికి చెందిన ఎం.బాలరాజు బాధితురాలి ఇంటి లోనికి అక్రమంగా ప్రవేశించాడు. ఆమెను మానభంగం చేసినాడనే ఫిర్యాదు మేరకు 14.09.2022న ఆత్మకూరు పోలీసు స్టేషన్ లో ఎస్సై కృష్ణమూర్తి కేసు నమోదు చేయడం జరిగింది. ఈ కేసుపై ఆత్మకూరు సర్కిల్ ఇన్ స్పెక్ట‌ర్ సుబ్రమణ్యం సమగ్ర దర్యాప్తు చేసి కోర్టుకు చార్జిషీటు అంద‌జేశారు. క‌ర్నూల్ జిల్లా మ‌హిళా కోర్టు సెష‌న్స్ జ‌డ్జి విచారణ జరిపి కేసులో జిల్లా మ‌హిళా కోర్టు సెష‌న్స్ జ‌డ్జి భూపాల్ రెడ్డి ముద్దాయి బాలరాజుకి ఏడేళ్ల జైలు శిక్ష, రూ.10వేల జరిమానా విధిస్తూ జడ్జిమెంట్ ఇవ్వడం జరిగింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement