Wednesday, May 1, 2024

KNL: రోడ్డు ప్రమాదంలో… ఒకరు మృతి, ఒకరికి గాయాలు

పాణ్యం (ప్రభ న్యూస్): 40వ నంబర్ జాతీయ రహదారిపై బలపనూరు మెట్ట యూటర్న్ వద్ద నంద్యాల మండలం భీమవరం గ్రామానికి చెందిన మాడుగల డేవిడ్ కింగ్ (35) రోడ్డు ప్రమాదంలో మృతి చెందినట్లు ఏఎస్ఐ సుబ్బయ్య తెలిపారు. బుధవారం బలపనూరు గ్రామంలో పెళ్లి పత్రికలు పంచి కౌలూరు మీదుగా భూపనపాడు వెళ్ళేందుకు యూటర్న్ వద్ద తిరుగుతున్న సమయంలో వెనుక నుండి లారీ అతివేగంతో వచ్చి ఢీకొనడంతో ద్విచక్ర వాహనం నడుపుతున్న డేవిడ్ కింగ్ అక్కడికక్కడే మృతిచెందాడు.

వెనుక కూర్చున్నటువంటి అన్నపురెడ్డి ప్రసాద్ గాయాలతో చాకచక్యంగా తప్పించుకుని బయటపడ్డాడు. మహారాష్ట్రకు చెందిన ఎంహెచ్ 25 ఏ జె 0609 నంబర్ గల లారీ యూటర్న్ తీసుకుంటున్న ద్విచక్ర వాహనం ఏపీ 21 బీబీ 4502ను ఢీకొనడంతో ఈ దుర్ఘటన జరిగింది. సంఘటనా స్థలానికి చేరుకున్న నేషనల్ హైవే వెహికల్ సిబ్బంది క్షతగాత్రున్ని చికిత్స నిమిత్తం ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. మృతుడు డేవిడ్ కింగ్ కు ఒక కుమార్తె, భార్య, ఉన్నారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement