Friday, March 29, 2024

21, 22 తేదీల్లో సీమ జిల్లాల్లో నాగబాబు పర్యటన..

తిరుపతి (రాయలసీమ ప్రభ వెబ్ ప్రతినిధి) : జనసేన పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ సభ్యులు కొణిదెల నాగబాబు ఈనెల 21న కర్నూలు జిల్లా, 22న అనంతపురం జిల్లాలో పర్యటించనున్నారు. 21 శనివారం ఉదయం కర్నూలు జిల్లా వీర మహిళల కోసం ఏర్పాటు చేసిన సభలో, మధ్యాహ్నం జన సైనికులకు ఏర్పాటు చేసిన సభలో నాగబాబు పాల్గొని ప్రసంగిస్తారు. 22న ఆదివారం అనంతపురం జిల్లా వీర మహిళలు, జనసైనికుల కోసం ఏర్పాటు చేసిన సభల్లో నాగబాబు పాల్గొని ప్రసంగిస్తారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement