Sunday, April 28, 2024

Kurnool: 39 మంది విద్యార్థుల‌కు అస్వ‌స్థ‌త : పరామర్శించిన భూమా

స్థానిక నంద్యాల పట్టణంలో విశ్వనగర్ నందు గల ప్రభుత్వ పాఠశాలలో మధ్యాహ్న భోజనం వికటించి సుమారు 39మందికి పైగా పిల్లలు అస్వస్థతకు గురయ్యారు. వారిని నంద్యాల ప్రభుత్వ జిల్లా ఆస్పత్రికి తరలించారు. పాఠశాలలో 82 మంది విద్యార్థులకు గాను 81 మంది మధ్యాహ్నం భోజనం చేశారు. భోజనం అనంతరం విద్యార్థులు ఒక్కొక్కరుగా వాంతులు చేసుకోగా, వారిని ప్రభుత్వ ఆసుపత్రిలో చేర్చారు. ఇప్పటివరకు 39 మంది ఆస్పత్రిలో చేరినట్లు వైద్య వర్గాలు వెల్లడించారు. విషయం తెలియగానే నంద్యాల మాజీ ఎమ్మెల్యే భూమా బ్రహ్మానందరెడ్డి ఆస్పత్రికి చేరుకొని అస్వస్థతకు గురైన విద్యార్థులను పరామర్శించారు.
అనంతరం హాస్పిటల్ సూపరింటెండెంట్ విజయ్ కుమార్ తో మాట్లాడి విద్యార్థుల ఆరోగ్య విషయంపై అడిగి తెలుసుకున్నారు. మాజీ మంత్రి భూమా అఖిలప్రియ కూడా విద్యార్థులను పరామర్శించారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement