Thursday, May 2, 2024

దాహార్తితో చిరుత పులి మృతి..!

నంద్యాల (ఆత్మకూరు రూరల్) : ఆత్మకూరు అటవీ డివిజన్, నల్లమల పరిధిలోని పెచ్చెరువు అటవీ ప్రాంతంలో బుధవారం చిరుత పులి మృతి చెందిన ఘటన వెలుగులోకి వచ్చింది. బుధవారం శ్రీశైలం రేంజ్ పెచ్చెరువు బీట్ దయ్యాల మడుగు ప్రాంతాల్లో చిరుత మృతదేహాన్ని ఫారెస్ట్ గస్తి సిబ్బంది గుర్తించారు. మూడు రోజుల క్రితం చిరుత మృతి చెందినట్లు అటవీ సిబ్బంది అనుమానం వ్య‌క్తం చేస్తున్నారు. హుటాహుటిన ఆత్మకూరు టైగర్ ప్రాజెక్ట్ డిప్యూటీ డైరెక్టర్ అలెన్ చాంగ్ తెరాన్, ఎన్.టి.సి.ఏ సభ్యుని సమక్షంలో శ్రీశైలం రేంజర్ అక్కడికి చేరుకొని పులి మృతదేహాన్ని పరిశీలించారు. నాలుగేళ్ల వయస్సు గల చిరుతను డాక్టర్లచే పోస్టుమార్టం నిర్వహించి ఖననం చేశారు. పూర్తి వివరాలను అధికారులు వెల్లడిస్తామన్నారు. శరీరం పై ఎలాంటి గాయాలు లేవని వైల్డ్, వెటర్నరీడాక్టర్లు వెల్లడించారు. తాగునీరు లేకే చిరుత పులి మరణించి ఉంటుందని అనుమానం వ్యక్తం అవుతుంది. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement