Monday, May 6, 2024

మానవత్వం చాటుకున్న సబ్ కలెక్టర్

నంద్యాల, – మతిస్థిమితం లేని ఓ మహిళను నంద్యాల సబ్ కలెక్టర్ కల్పనా కుమారి మంగళ వారం ఆస్పత్రిలో చేర్పించారు. విధి నిర్వహణలో భాగంగా నంద్యాలలో పర్యటిస్తుండగా ఎమ్మెస్ నగర్ లో ఓ చెట్టుకింద మతిస్థిమితం లేని మహిళ ఇబ్బంది పడుతున్నట్లు గా గమనించిన నంద్యాల సబ్ కలెక్టర్ ఆ మహిళ వద్దకు చేరుకొని వివరాలు అడుగగా మతిస్థిమితం లేని మహిళా కావడం చేత సమాధానం ఏమీ ఇవ్వలేదు .ఆకలితో ఉన్న ఆ మహిళకు బిస్కెట్స్, మంచి నీరు అందించి శిశు సంక్షేమ శాఖ సి డి పి ఓ చంద్రకళ ను పిలిపించి ఈ మహిళను వెంటనే ఆస్పత్రిలో చేర్పించాలని ,వైద్యం అందించాలని అవసరమైతే మెరుగైన చికిత్స కొరకు కర్నూల్ కు పంపించమని ఆదేశించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement