Saturday, May 4, 2024

Kurnool – గణేష్ నిమజ్జనం కు నీటి గండం – కేసీ కాలువలో నీళ్ల‌కు క‌ట‌క‌ట‌

కర్నూల్ నగరంలో మంగళవారం నిర్వహించనున్న గణేష్ నిమజ్జనంకు నీటి గండం తప్పేలా లేదు. ప్రస్తుతం సుంకేసుల జలాశయంలో ఒక టిఎంసి పైగా నీళ్లు ఉన్నాయి. ప్రస్తుతం ఎగువ నుంచి సుంకేసులకు ఎటువంటి నీటి ప్రవాహం లేదు. దీంతో సుంకేసుల నుంచి కేసీ కెనాల్ కి నీళ్లు విడుదల చేయడం లేదు. ఇదే సమయంలో గణేష్ నిమజ్జన కార్యక్రమం నిర్వహించాల్సి రావడంతో నీటి సమస్య ఏర్పడింది. ఈ క్రమంలో సుంకేసులో నిల్వ ఉన్న నీటిలో కొంత వదలాలని నిర్ణయించారు. అయితే ఆ నీరు దిగువకు వెళ్లకుండా ప్రస్తుతం వినాయక ఘాటు వద్ద కేసీ కాలువలో ఇసుక మూటలు వేసి నిలిపేందుకు అధికారులు ప్రయత్నం చేస్తున్నారు. ఇలా నిలిపిన నీటిలో గణేష్ నిమజ్జనం నిర్వహించనున్నారు. ఆదివారం జిల్లా కలెక్టర్ సృజన నేతృత్వంలో మేయర్ బివై రామయ్య, జిల్లా ఎస్పీ కృష్ణ కాంత్, కర్నూల్ నగరపాలక సంస్థ అధికారులు కేసీ కెనాల్ వెంట పర్యవేక్షణ ఏర్పాట్లను పరిశీలించడం విశేషం.

Advertisement

తాజా వార్తలు

Advertisement