Monday, April 29, 2024

పదో తరగతి పరీక్ష కేంద్రాల్లో ఆకస్మిక తనిఖీలు

కర్నల్ జిల్లా వ్యాప్తంగా 10వ తరగతి పరీక్షలు జరుగుతున్నారు. ఈ సందర్భంగా   కర్నూలులోని ప్రభుత్వ బాలికల ఉన్నత పాఠశాలలోని పరీక్ష కేంద్రాన్ని కర్నూల్ రేంజ్ డిఐజి ఎస్. సెంథిల్ కుమార్ పరిశీలించారు. అలాగే, ఉర్ధూ బాలికల  పాఠశాలలోని పరీక్ష కేంద్రాన్ని కర్నూల్ జిల్లా ఎస్పీ సుధీర్ కుమార్ రెడ్డి తనిఖీలు చేశారు. జిల్లాలో 10వ తరగతి పరీక్షలు ప్రశాంతంగా జరుగుతున్నట్లు పోలీసు అధికారులు తెలిపారు. పరీక్షల సమయంలో విద్యార్థులకు ఏలాంటి ఇబ్బందులు లేకుండా చూసుకోవాలని సూచించారు. పరీక్ష జరుగుతున్న తీరును అధికారులను అడిగి తెలుసుకున్నారు. ప్రశ్నా పత్రాల భద్రత, పరిరక్షణ గురించి చేపట్టిన చర్యలపై విచారించి ప్రిన్సిపాల్స్ కు, ఇన్విజిలేటర్లకు ఆదేశాలు ఇచ్చారు. జిల్లాలో జరుగుచున్న పదవ తరగతి పరీక్ష కేంద్రాల వద్ద కట్టుదిట్టమైన భద్రత ఏర్పాట్లు చేసినట్లు వెల్లడించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement