తెలుగు దేశం పార్టీతోనే మహిళా సాధికారత
వైసీపీ పాలనలో గంజాయి, డ్రగ్స్ గా రాష్ట్రం
వైసీపీకి ఎవరు ఓటు వేసినా సమాజానికి ద్రోహం చేసినట్లే
సిద్దం అంటున్న జగన్ ను
ఓడించడానికి జనమంతా సిద్ధం అంటున్నారు
కుప్పంలో మహిళా సదస్సులో చంద్రబాబు వ్యాఖ్యలు
కుప్పం, (ప్రభ న్యూస్ ): రాష్ట్రం, దేశంలో మొట్టమొదటి సారిగా మహిళల అభివృద్ధి, సంక్షేమం గురించి మాట్లాడిన ఏకైక పార్టీ టీడీపీ అని, మొదటి సారిగా ఎన్టీఆర్ మహిళలకు ఆస్తిలో సమానహక్కు కల్పించారని చంద్రబాబు తెలిపారు. కుప్పం నియోజకవర్గం రెండు రోజుల పర్యటనకు వచ్చిన ఆయన మొదటి రోజు జరిగిన మహిళా సదస్సులో మాట్లాడుతూ స్థానిక సంస్థల ఎన్నికల్లో మహిళలకు రిజర్వేషన్లు తీసుకొచ్చామని, సర్పంచులు, ఎంపీటీసలు, జడ్పీటీసీలు, ఎమ్మెల్యేలు మహిళలు అయ్యారంటే దానికి ఎన్టీఆర్ ఇచ్చిన 8 శాతం రిజర్వేషన్లే కారణం అని తెలిపారు.
మహిళలకు ఆర్థిక స్వాతంత్ర్యం తీసుకొచ్చామని, చదువుకోని మహిళలనుఇంటికొకరి చొప్పున డ్వాక్రా సంఘాలు పెట్టామని అన్నారు.. . మహిళలను ఎగతాళి చేసే రోజుల నుండి ఇంటిని కాపాడే పరిస్థితి వచ్చారని నిరూపించింది టీడీపీనే అని చంద్రబాబు అన్నారు . అదేవిధంగా మహిళల కోసం వినూత్నమైన కార్యక్రమాలు చేపట్టామని అన్నారు. లక్షల మంది మహిళల జీవితాలు బాగున్నాయంటే అది టీడీపీ చొరవన్నారు. తాను మొదటి సారి కుప్పం వచ్చినప్పుడు డ్వాక్రా సంఘాలు లేవనీ ఇప్పుడు 60 వేల మంది ఉన్నారన్నారు. డ్వాక్రా సంఘాలతో పాటు పాడిపరిశ్రమను ప్రోత్సహించామని వెల్లడించారు.. ఇంటికి రెండు ఆవులు ఇస్తా అంటే నవ్వారని, ఇప్పుడు కుప్పంలో నాలుగు లక్షల లీటర్ల పాలు సేకరణ జరుగుతోందని ఇది చాలా గొప్ప విషయం అన్నీ ఆయన అన్నారు.
మహిళలను ఆర్థికంగా పైకి తీసుకురావడానికి వేసిన మొదటి అడుగు పాడిపరిశ్రమ అని తెలిపారు. తన తల్లి కట్టెల పొయ్యితో ఇబ్బంది పడేదని, కట్టెల పొయ్యిలు పోయి మహిళలు ఇబ్బంది లేకుండా ఉండాలని దీపం పథకం ద్వారా వంటగ్యాస్ అందించాన్నారు. మరుగుదొడ్లు లేక ఇబ్బందులు పడుతుంటే ఆత్మ గౌరవం పేరిట మరుగుదొడ్లు కట్టించామన్నారు. మధ్యాహ్న భోజన పథకం పెట్టి అందులోనూ మహిళలకు అవకాశం కల్పించామన్నారు. అంగన్వాడీ, రేషన్ షాపులు, సుజల స్రవంతి వాటర్ ప్లాంట్లు కూడా ఏర్పాటు చేసి మహిళలకు అవకాశం కల్పించామని చంద్రబాబు చెప్పారు..
ఒంటరి మహిళలకు పెన్షన్ విధానానికి శ్రీకారం చుట్టింది టీడీపీనే అని తెలిపారు. స్కూలుకు వెళ్లడానికి ఆడపిల్లలు ఇబ్బందులు పడుతుంటే ఆడపిల్లలందరికీ సైకిళ్లు అందించామని గుర్తు చేశారు. ఉద్యోగాల్లోమహిళలకు 33 శాతం రిజర్వేషన్లు కల్పించామని గుర్తు చేశారు. కండక్టర్లుగా కూడా మహిళలను నియమించామని, . ప్రతి కిలోమీటరుకు ఒక ఎలమెంటరీ స్కూలు, ప్రతి 3 కి.మీ అప్పర్ ప్రైమరీ, మండలానికి ఒక జూనియర్ కాలేజీ, రెవెన్యూ డివిజన్ కు ఒక ఇంజనీరింగ్ కాలేజీలు తీసుకొచ్చామని చంద్రబాబు గుర్తు చేశారు. పసుపుకుంకమ ద్వారా రూ.8,800 కోట్లు అందించి 10 వేల కోట్లు డ్వాక్రా రుణాలు మాఫీ చేశామని చెప్పారు. ఉచితంగా 11 రకాల వైద్య సదుపాయాలు అందించామన్నారు. అదేవిధంగా అన్న అమృత హస్తం కింద గర్భిణులకు పరీక్షలు, బేబీ కిట్లు , తల్లీ బిడ్డ ఎక్స్ ప్రెస్, బాలామృతంతో పాటు ప్రసవించినప్పుడు రూ.5,500 ఆర్థికసాయం అందించామన్నారు.
పెళ్లికానుకలతో పాటు ఒక అన్నగా సామూహిక సీమంతాలు నిర్వహించామని, కానీ ఇవన్నీ ఇప్పుడు ఉన్నాయా ఆడపిల్లలకు జగన్ ఫ్రభుత్వం ఏం చేసిందని చంద్రబాబు ప్రశ్నించారు. తెదేపా కొత్త పథకాలకు శ్రీకారం చుట్టామని ఇంట్లో ఎంత మంది ఉంటే అంతమంది ఆడబిడ్డలకు నెలకు రూ.15 వందలు ఆడబిడ్డ నిధి కింద అందిస్తామన్నారు. నేరుగా మీ అకౌంట్లోకే డబ్బులు వస్తాయన్నారు. ఎంత మంది పిల్లలున్నా తల్లికి వందనం ద్వారా ఒక్కొక్కరికి రూ.15 వేలు అందిస్తామన్నారు.
గ్యాస్ ,పెట్రోల్, డీజల్, కందిపప్పు, చింతపండు, పంచదార అన్ని ధరలు పెరిగాయన్నారు . మద్యం ధరకు రెక్కలు వచ్చాయన్నారు. క్వార్టర్ మద్యం రూ.60 నుండి 200లకు పెంచి వంద దోచేసిన జలగ జగన్ అన్నారు. నాసిరకం మద్యంతో ఆడబిడ్డల తాళిబొట్లు తెంచాడని జగన్ పై ఫైర్ అయ్యారు… ఇచ్చేది 10రూపాయలు దోచేది వంద రూపాయలు అన్నారు. జలగ మాదిరిగా జగన్ జనం రక్తం తాగుతున్నారని తెలిపారు. కుప్పంలో రాళ్లు, ఇసుకను కూడా దోచుకున్నారు. రౌడీలు జాగ్రత్తగా ఉండాలని లేకుంటే జజారులో నిలబెడతా అన్నారు.
రాష్ట్రంలో మహిళలంతా టీడీపీ పక్షమేనని, . టీడీపీకి ఓటేస్తే పిల్లల భవిష్యత్తు బాగుంటుందని భర్తలకు మహిళలు చెప్పాలన్నారు. తనను ఎన్నో సార్లు వేదించారని, . అసెంబ్లీలో తనను తిట్టారని అంటూ రాజకీయాల్లో లేని తన సతీమణి భువనేశ్వరిని అవమానించారని ఆవేదన వ్యక్తం చేశారు. కౌరవసభను గౌరవ సభగా చేసి సీఎంగానే అడుగుపెడతానని శపథం చేశానని అన్నారు.. నా శపథం, మీ భవిష్యత్తు, పిల్లల భవిష్యత్తు, రాష్ట్ర భవిష్యత్తు బాగుండాలంటే ఈ 40 రోజులు మీరు కష్టపడి టీడీపీని గెలిపించాలన్నారు. జగన్ లా రూ.10 ఇచ్చి వంద కొట్టేసే ఆలోచన నాది కాదని, . సంపద సృష్టించి మీ ఆదాయాన్ని పెంచుతా. రూ.10లు ఇచ్చి రూ.100 సంపాదించే మార్గాన్ని చూపిస్తానని చంద్రబాబు తెలిపారు. సంపద సృష్టిస్తూ పేదరికం లేని సమాజం నిర్మిస్తానని అన్నారు.
తాను సీఎంగా ఉన్నప్పుడు గురజాలలో ముస్లిం బాలికపై అత్యాచారం జరిగిందన్నారు. 24 గంటల్లో పట్టుకోవాలని ఆదేశించడంతో చెట్టుకు ఉరేసుకుని నిందుతుడు చనిపోయాడని ఆయన తెలిపారు. ఎవరైనా ఆడబిడ్డల జోలికి వస్తే అదే చివరి రోజు. ఇక జగన్ పాలనలో రాష్ట్రంలో గంజాయిని వాణిజ్య పంట చేశారని, . డబ్బులకు కక్కుర్తి పడి విదేశాల నుండి డ్రగ్స్ తెస్తున్నారని ఆరోపించారు. జగన్ తన చీకటి వ్యాపారాలతో రాష్ట్రాన్ని భ్రష్టు పట్టించారన్నారు. . అవసరం అయితే మహిళలకు ప్రత్యేక చట్టం తెచ్చి రక్షణ కల్పిస్తామన్నారు.
కుప్పం ప్రజలు మనసులో పెట్టుకుని చూసుకొంటున్నారు….
ఎక్కడికి వెళ్లినా రాని ఆనందం కుప్పం వస్తే ఉంటుందని అన్నారు చంద్రబాబు. మహిళలకు అండగా ఉంటానని, . మీ ద్వారా మీ కుటుంబాన్ని బాగు చేసే పరిస్థితి వచ్చేందుకు ఆదాయాన్ని పెంచి చూపిస్తా అని చంద్రబాబు పేర్కొన్నారు. తనకు స్ఫూర్తి కుప్పం అని, నిండు మనసుతో నన్ను 7 సార్లు ఆదరించి గెలిపించారని అంటూ కుప్పం ఓటర్లకు చంద్రబాబు ధన్యవాదాలు తెలిపారు. మళ్లీ గెలిచే ముందు మీ ఆశీర్వాదం కోసం వచ్చానని, . నిజమైన దేవతలు మా ఆడబిడ్డలే అని తెలిపారు.
మహిళలు పూర్తిగా రాజకీయాల్లోకి వస్తే కుర్చీ కోసం మగవారు ఎతుక్కునే పరిస్థితి వస్తుందని, 45 ఏళ్లుగా ఆదరిస్తున్న ప్రజలకు రుణపడి ఉన్నానని చంద్రబాబు తెలిపారు. మీ అన్నగా తమ్ముడిగా మీకు విజ్ఞప్తి చేస్తున్నా వచ్చే ఎన్నికల్లో మనందరి లక్ష్యం లక్ష మెజారిటీనే పెట్టుకోవాలని కోరారు. నియోజకవర్గంలో 75 శాతం ఓట్లు టీడీపీకే రావాలన్నారు. రాష్ట్రం, పిల్లల భవిష్యత్తు కోసం ఆలోచించేవారు వైసీపీకి ఓటు వేయరని ధీమా వ్యక్తం చేశారు. కుప్పంలో టీడీపీ నేతలపై అక్రమ కేసులు పెట్టి జైలుకు పంపారన్నారు. తాను బతికేది రాష్ట్రం, ప్రజల కోసమని అన్నారు. గాడి తప్పిన పాలనను మళ్లీ గాడిలో పెడతానని చంద్రబాబు హామీ ఇచ్చారు.
ఏక పక్షంగా ఎన్నికలు జరగాలని, ప్రజలు గెలవాలని, రాష్ట్రం నిలవాలని చంద్రబాబు నినదించారు. తనకు ముఖ్యమంత్రి పదవి కొత్తకాదని, తనకు ముఖ్యం రాష్ట్రంలోని ప్రజలన్నారు. ప్రపంచం అభివృద్ధిలో ముందుకు వెళ్తుంటే ఏపీ తిరోగమనంలో వెళ్తోందని ఆవేదన వ్యక్తం చేశారు..