Saturday, April 27, 2024

నూజివీడు ట్రిపుల్ ఐటిలో విద్యార్థి ఆత్మహత్య

నూజివీడు : నూజివీడు ట్రిపుల్ ఐటిలో ఈ ఉదయం పీయూసీ మొదటి సంవత్సరం చదువుతున్న కృష్ణ జిల్లా కోడూరు మండలం ఇరాలి గ్రామంనకు చెందిన గంజల మణిఖంట నూజివీడు ట్రిపుల్ ఐటిలోని ఐ2 బాయ్స్ హాస్టల్ లో ఈరోజు ఉదయం ఫ్యానుకు ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకొన్నాడు. ఆత్మహత్యకు కారణాలు తెలియవలసి ఉన్నది. నూజివీడు డీస్పీ బి. శ్రీనివాసులు ఆధ్వర్యంలో పోలీస్ సిబ్బంది హుటాహుటిన ట్రిపుల్ ఐటికి చేరుకొని పోస్ట్మార్టం నిమిత్తం బాడీని నూజివీడు ప్రభుత్వ హాస్పిటల్ కు తరలించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మృతుని తల్లిదండ్రులకు సమాచారం అందించారు. ఈ సంఘటనతో విద్యార్థులు భయబ్రాంతులకు గురవుతున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement