Saturday, July 27, 2024

గ‌రిక‌పాడు చెక్ పోస్ట్ వ‌ద్ద రూ. కోటికి పైగా న‌గ‌దు ప‌ట్టివేత‌..

జగ్గయ్యపేట మండలం గరికపాడు చెక్‌పోస్ట్‌ వద్ద పోలీసుల‌ తనిఖీల్లో భాగంగా రూ.కోటి పట్టుబడింది. కారులో తరలిస్తున్న రూ.1.40కోట్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. కారులో ఉన్న ఇద్ద‌రు వ్య‌క్తుల‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.. కాగా మధిర మిరప రైతులకు చెల్లించాల్సిన పంట డబ్బుగా ఆ వ్యాపారి వెల్లడించాడు. కేసు నమోదు చేసి విచార‌ణ జ‌రుపుతున్న‌ట్లు ఎస్ఐ వాసా వెంకటేశ్వరరావు తెలిపారు

Advertisement

తాజా వార్తలు

Advertisement