Thursday, April 25, 2024

ముంబై ఇండియన్స్ సేఫ్

ముంబై ఇండియన్స్ ఫ్రాంచైజీకి బిగ్ రిలీఫ్. కరోనా పరీక్షల్లో అందరు ఆటగాళ్లతో పాటు సపోర్టింగ్ స్టాఫ్ కు నెగటివ్ ఉన్నట్టుగా తేలింది. ఆటగాళ్లు, అధికారులకు కరోనా పరీక్షలు చేయించాలని ఫ్రాంచైజీ యాజమాన్యం నిర్ణయించడంతో శిక్షణా శిబిరాన్ని రద్దు చేశారు. అయితే అదృష్టవశాత్తూ ఎవరిలోనూ కరోనా లేదని, జట్టు మొత్తం నేడో, రేపో ముంబైకి చేరుకుంటుందని జట్టు ప్రతినిధులు తెలిపారు. కరోనా సోకినా లక్షణాలు లేకుండా పలువురు కనిపిస్తున్నందునే అందరికీ పరీక్షలు నిర్వహించామని, బీసీసీఐ విధివిధానాల మేరకు ఈ నిర్ణయం తీసుకున్నామని ఎంఐ టీమ్ తన ట్విట్టర్ ఖాతాలో పేర్కొంది. ఇక తమకు కరోనా సోకలేదని తెలుసుకున్న జస్ ప్రీత్ బుమ్రా, రోహిత్ శర్మ తదితర ఆటగాళ్లు ప్రాక్టీసులో నిమగ్నమయ్యారు.

గడచిన రెండు సంవత్సరాల్లో ఐపీఎల్ టైటిళ్లను గెలుచుకున్న ముంబై ఇండియన్స్ వరుసగా మూడవ సారి కూడా గెలుచుకోవడం ద్వారా హ్యాట్రిక్ సాధించాలని భావిస్తోంది. ముంబై ఇండియన్స్ సీజన్ తొలి మ్యాచ్ ని బెంగళూరు తో తలపడనుంది. ఏప్రిల్ 9న చెన్నై వేదికగా మ్యాచ్ జరగనుంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement