Friday, May 17, 2024

AP: ఎన్టీఆర్ జిల్లాలో రోడ్డు ప్ర‌మాదం… ఇద్ద‌రు మృతి

(విస్సన్నపేట, ప్రభ న్యూస్): ఎన్టీఆర్ జిల్లాలోని విస్సన్నపేట పరిధిలో రహదారి ప్రమాదంలో చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో ఇద్దరు వ్యక్తులు మృతి చెందారు. విస్సన్నపేట నుండి నూజివీడు వెళ్లే రహదారిలో లారీ బైకును ఢీకొనడంతో ఈ ప్ర‌మాదం జరిగింది.

ద్విచక్ర వాహనంపై విస్సన్న వైపు నుండి నూజివీడు రోడ్డు వైపు వెళుతూ లారీని ఢీకొట్టారు. మృతి చెందిన ఇద్దరు వ్యక్తులను ప్రాథమికంగా గుర్తించారు. కొండపారు కొండ పర్వ వాసులుగా గుర్తించిన వీరిలో ఒకరు కోలా మల్లికార్జున రావు (24) రెండో వ్యక్తి మణికల విజయ (26)గా గుర్తించారు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement