Wednesday, May 1, 2024

గన్నవరంలో రోడ్డు ప్ర‌మాదం.. ఒక‌రి మృతి

కృష్ణా : గన్నవరం ఆర్టీసీ బస్ స్టాండ్ వద్ద జాతీయ రహదారిపై రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. రాజమండ్రిలో శుభకార్యానికి వెళ్లి తిరిగి విజయవాడ వస్తుండగా గన్నవరం ఆర్టీసీ బస్ స్టాండ్ వద్ద లారీని కారును వెనక నుండి వ‌చ్చి ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఏపీ జెన్ కో ఉద్యోగి వరప్రసాద్ భార్య ఘటనా స్థలంలోనే మృతి చెందింది. కారులో ముగ్గురు ప్రయాణిస్తుండగా వర ప్రసాద్ కు స్వల్ప గాయాలు కాగా ఒక మహిళ మృతి, మరో మహిళకు తీవ్ర గాయాల‌య్యాయి. గాయపడిన మహిళల‌ను 108 వాహనంలో కామినేని హాస్పిటల్ కి తరలించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement