Friday, May 3, 2024

భీమ‌వ‌రం టోల్ ప్లాజా వ‌ద్ద రోడ్డుప్ర‌మాదం.. తండ్రి, కుమార్తె దుర్మ‌ర‌ణం

విజయవాడ: జాతీయ రహదారి 65 మీదగట్టు భీమవరం టోల్‌ప్లాజా సమీపంలో మంగళవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో తండ్రి, కుమార్తె మృతి చెందారు. ముందు వెళ్తున్న లారీ ఒకసారిగా ఆగడంతో వెనుక వెళ్ళే బైక్ ఢీ ఢీకొట్టింది. బైక్ మీద భార్యాభర్తలు, ఇద్దరు పిల్లలు వెళ్తున్నారు. ఈ క్రమంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో తండ్రి, చిన్నపాప రోడ్డు మీద పడి అక్కడికక్కడే మృతి చెందగా… తల్లి, పెద్దపాపకు గాయాలయ్యాయి. వెంటనే వారిని జగ్గయ్యపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. . వెంటనే అక్కడకు చేరుకున్న పోలీసులు క్ష‌త‌గాత్రుల‌ను హాస్ప‌ట‌ల్ కు త‌ర‌లించారు…. భాదితులు నాగాయలంక మండలం టీ కొత్తపాలెం శివారు డేగల పాలెం గ్రామానికి చెందిన వారిగా గుర్తించారు.. ఈ ఘటనలో దోమ సుకుమార్ తో పాటు 5 సంవత్సరాల కుమార్తె ఐశ్వర్య మరణించారు. సుకుమార్ భార్య రాధిక, సిరి లకు గాయాలై జగ్గయ్యపేట ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement