Thursday, May 2, 2024

Vijayawada : టవర్ పై నుండి దూకి తల్లీ కూతుళ్ల‌ ఆత్మహత్య

ట‌వ‌ర్ పై నుండి దూకి త‌ల్లీకూతుళ్లు ఆత్మ‌హ‌త్య చేసుకున్న ఘ‌ట‌న ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్రంలో చోటుచేసుకుంది. రాష్ట్రంలోని విజయవాడ గొల్లపూడి వన్ సెంటర్ సాయి శేషు టవర్స్ పై ఐదవ అంతస్తు నుండి దూకి తల్లీ కూతుళ్లు ఆత్మహత్య చేసుకున్నారు. ట‌వ‌ర్ పై నుండి దూకిన త‌ల్లీ కూతుళ్లు కందుల మాధవి, బొప్పన సత్యవతిగా గుర్తించారు. అయితే ఇద్ద‌రూ సంఘటనా స్థలంలోనే మృతిచెంచారు. సమాచారం అందుకున్న భవానిపురం సీఐ ఉమర్ సంఘటనా స్థలానికి చేరుకొని మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వాస్ప‌త్రికి తరలించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement