Saturday, September 21, 2024

ఆ ఉత్త‌ర్వుల‌ను ర‌ద్దు చేయండి..

గూడూరు గ్రామ కంఠంలో ఎన్నో ఏళ్ళుగా అపరిష్కృతంగా ఉన్న భూముల రిజిస్ట్రేషన్ కి సంబంధించి ఎండోమెంట్స్ కమిషనర్ గతంలో ఇచ్చిన ఉత్తర్వులు రద్దు చేయాలని మంగళవారం పెడన శాసన సభ్యులు జోగి రమేష్ , గూడూరు ఎంపీపీ అభ్యర్థి సంగా మధుసూదన రావు మండల రైతు భోరోసా కేంద్రం చైర్మన్ గొరిపర్తి .రవి కుమార్ లు రాష్ట్ర దేవాదాయ శాఖ కమిషనర్ కు విన‌తి ప‌త్రం అంద‌జేశారు. ఈ సందర్భంగా జోగి రమేష్ క‌మిష‌న‌ర్ తో మాట్లాడుతూ, కేవలం 10 సెంట్ల దేవాదాయ భూమి కోసం వందలాది పొలాలు, ఇళ్ల రిజిస్ట్రేషన్లు ఆగి ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని వివ‌రించారు.. సమస్య పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని కోరారు.. దీనిపై క‌మిష‌న‌ర్ స్పందిస్తూ, గతంలో ఇచ్చిన ఉత్తర్వులు 15 రోజుల్లో వెనక్కి తీసుకుంటామని హామీ ఇచ్చారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement