Monday, April 29, 2024

కట్టలేరు వాగుపై పెరిగిన ఉధృతి.. 20 గ్రామాల‌కు నిలిచిన రాక‌పోక‌లు

ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్రంలోని ఎన్టీఆర్ జిల్లా తిరువూరు నియోజకవర్గం గంపలగూడెం మండలం వినగడప – తోటమూల గ్రామాల మధ్య కట్టలేరు వాగుపై వరదనీరు ఉధృతంగా ప్రవహిస్తోంది. గంపలగూడెం మండల కేంద్రం నుండి విజయవాడ, మైలవరం వెళ్లే ప్రధాన రహదారిపై రాకపోకలు నిలిచిపోయాయి. 20 గ్రామాలకు రాకపోకలు బంద్ కావడంతో వాహన దారులు తీవ్ర అవస్థలు పడుతున్నారు. ఎలాంటి ప్రమాదాలు జరగకుండా రెవెన్యూ, పోలీస్ అధికారులు బందోబస్తు ఏర్పాటు చేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement