Tuesday, April 30, 2024

మినుము పోత మిషన్ బోల్తా.. మ‌హిళ మృతి

  • కాల్వ గట్టు పై పల్టీ కొట్టిన యంత్రం
  • ముగ్గురికి గాయాలు..కృష్ణా జిల్లాలో్ ఘ‌ట‌న‌

మోపిదేవి : కృష్ణా జిల్లా మోపిదేవి మండ‌లంలో జ‌రిగిన ఒక ప్ర‌మాదంలో ఓ మ‌హిళ మృతి చెందింది.మండల పరిధిలోని మోపిదేవి లంక కాలవగట్టుపై మినుము పూత మిషన్ బోల్తా కొట్ట‌డంతో మోపిదేవి గ్రామానికి చెందిన డొక్కు నాగలక్ష్మి (45 ) దుర్మ‌ర‌ణం పాలైంది. ఈ ప్ర‌మాంలో మరో ముగ్గురు మహిళలకు గాయాలయ్యాయి. వారిలో మరొకరి పరిస్థితి విషమంగా ఉంది. సమాచారం అందుకున్న 108 సిబ్బంది హుటాహుటిన క్ష‌త‌గాత్రుల‌ను చ‌ల్ల‌ప‌ల్లిలోని ప్రైవేట్ హాస్పిటల్ కు త‌ర‌లించారు. పోత మిషన్ పైన నలుగురు కూలీలు ఉన్నట్లు సమాచారం.

Advertisement

తాజా వార్తలు

Advertisement