Thursday, April 25, 2024

కుటుంబ కలహాలతో వృద్ధురాలిని నరికి చంపాడు..

కుటుంబ క‌ల‌హాల‌తో వృద్ధురాలిని క‌త్తితో పీక కోసి చంపిన ఘ‌ట‌న రామవరప్పాడులో చోటుచేసుకుంది. సాయి అనే వ్య‌క్తి కొన్నేళ్ల క్రితం ప్రేమ వివాహం చేసుకున్నాడు. భార్య భ‌ర్త‌ల మ‌ధ్య గొడ‌వ‌లు రావ‌డంతో వేర్వేరుగా ఉంటున్నారు. భార్య కాపురానికి రావడం లేదంటూ సాయి తరచూ ఘర్షణ పడుతుండేవాడు. భార్యతో పాటు ఆమె అమ్మమ్మ కట్టా సామ్రాజ్యం ఉండేది.. గొడ‌వ‌ల నేప‌త్యంలో వృద్ధురాలిని కత్తితో నరికి చంపేశాడు. స‌మాచారం అందుకున్న పోలీసులు ఘ‌ట‌న స్థ‌లానికి చేరుకున్నారు. పోస్టుమార్టం నిమిత్తం మృత‌దేహాన్ని ఆస్ప‌త్రికి త‌ర‌లించారు. ఇంకా పూర్తి విరాలు తెలియాల్సి ఉంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement