Thursday, April 18, 2024

కారు బీభత్సం.. ఇద్దరు మృతి, ఇద్ద‌రికి తీవ్ర‌గాయాలు

కారు బీభ‌త్సం సృష్టించ‌డంతో ఇద్ద‌రు మృతిచెంద‌గా, మ‌రో ఇద్ద‌రికి తీవ్ర‌గాయాలైన ఘ‌ట‌న‌ హైదరాబాద్‌లోని బంజారాహిల్స్‌లో చోటుచేసుకుంది. ఈ నూతన సంవత్సర వేడుకలు వారి పాలిట శాపంగా మారాయి. ఇవాళ‌ తెల్లవారుజామున బంజారాహిల్స్‌లో వేగంగా దూసుకొచ్చిన కారు అదుపుతప్పి.. రోడ్డుపక్కన టిఫిన్‌ చేస్తున్న ఇద్దరిపై నుంచి దూసుకెళ్లింది. అంతేగాకుండా ఆగిఉన్న మరో రెండు కార్లను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఇద్దరు వ్యక్తులు అక్కడికక్కడే మృతిచెందగా, మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. క్షతగాత్రులను దవాఖానకు తరలించారు. ఈ ప్ర‌మాదంలో మృతులు భీమ‌వ‌రంకు చెందిన ఈశ్వ‌రీ, రావుల‌పాలెంకు చెందిన శ్రీనివాస్ గా గుర్తించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement