Saturday, May 18, 2024

విజ‌య‌వాడ‌లో టిడిపి నాలుగు సీట్లు కూడా గెల‌వ‌లేదు – మంత్రి పెద్దిరెడ్డి..

విజ‌య‌వాడ‌: న‌గ‌ర పాల‌క‌సంస్థ‌కు జ‌రుగుతున్న ఎన్నిక‌ల‌లో వైసిపి విజ‌యం సాధించ‌డం త‌ధ్య‌మ‌ని మంత్రి పెద్దిరెడ్డి రామ‌చంద్రారెడ్డి అన్నారు. ఈ ఎన్నిక‌ల‌లో టీడీపీకి నాలుగైదు సీట్లు కూడా రావన్నారు. కృష్ణా జిల్లా మున్సిపల్‌ ఎన్నికలపై వైయస్‌ఆర్‌సీపీ నేతలు సమీక్ష నిర్వహించారు. వైయస్‌ఆర్‌సీపీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి, మంత్రులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, వెల్లంపల్లి శ్రీనివాస్, ఎమ్మెల్యేలు జోగి రమేష్, మల్లాది విష్ణు, సామినేని ఉదయభాను, నాయకులు దేవినేని అవినాష్,తదితరులు పాల్గొన్నారు. ఎన్నికల ప్రచారంపై చర్చించారు. నేతలకు సజ్జల రామకృష్ణారెడ్డి, మత్రులు దిశా నిర్దేశం చేశారు. అనంత‌రం పెద్దిరెడ్డి మీడియాతో మాట్లాడుతూ, అన్ని మున్సిపాలిటీలను గెలుచుకుంటామని పేర్కొన్నారు. త‌మ పార్టీని విమర్శించే ముందు చంద్రబాబు తన పార్టీ సంగతి చూసుకోవాలని హితవు పలికారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement