Monday, April 29, 2024

ఈ నెల 7న ఇంద్రకీలాద్రిపై కోటి దీపోత్సవం

ఈ నెల 7న కోటి దీపోత్సవాన్ని నిర్వహించనున్నట్లు విజయవాడ ఇంద్రకీలాద్రి ఆలయ అధికారులు తెలిపారు.
దేవస్థానం ఆధ్వర్యంలో సాయంత్రం 4 నుంచి రాత్రి 7 గంటల వరకు గిరి ప్రదక్షిణకు రంగం సిద్ధం చేశామన్నారు. గిరిప్రదక్షిణ దుర్గగుడి టోల్‌గేట్‌ సమీపంలోని ఆలయం నుంచి ప్రారంభమై కుమ్మరిపాలెం, చిట్టినగర్‌, కొత్తపేట, నెహ్రూబొమ్మ సెంటర్‌, బ్రాహ్మణ వీధి మీదుగా మల్లికార్జున మహామండపం వద్దకు చేరుతుందని ఆలయ అధికారులు తెలిపారు.అమ్మవారి ప్రధాన ఆలయంతో పాటు ఉపాలయాలు, కనకదుర్గానగర్‌, చిన్న రాజగోపురం, పెద్ద రాజగోపురం ప్రాంగణలో భక్తులు దీపాలు వెలిగించేందుకు జోన్‌లుగా విభజించినట్లు వెల్లడించారు. అదేవిధంగా సాయంత్రం 6.30 గంటలకు సంప్రదాయబద్ధంగా జ్వాలాతోరణం నిర్వహిస్తున్నామని తెలిపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement