Friday, March 29, 2024

BREAKING : పారదర్శకంగా కౌంటింగ్‌ : సీఈవో వికాస్‌రాజ్‌

మునుగోడు ఉప ఎన్నిక ఓట్ల లెక్కింపు పారదర్శంగా జరుగుతోందని రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి వికాస్‌ రాజ్‌ తెలిపారు. ప్రతీ టేబుల్‌ దగ్గర అభ్యర్థుల ఏజెంట్లు ఉన్నారన్నారు. కౌంటింగ్‌లో ఎలాంటి ఇబ్బంది లేదన్నారు. ప్రతి రౌండ్‌కి అరగంట కంటే ఎక్కువ సమయం పడుతోంది. ఆర్వో సంతకం చేసిన తర్వాతే ఫలితాలు విడుదల చేస్తున్నామన్నారు. మునుగోడులో మొత్తం 47 మంది అభ్యర్థులు ఉన్నారు. ఎక్కువ మంది అభ్యర్థులు ఉన్నందుకే కౌంటింగ్‌ ప్రక్రియ ఆలస్యం అవుతుందని అబ్జర్వర్‌ చెబుతున్నారని తెలిపారు. ఇతర రాష్ట్రాల్లో ఫలితాలను మునుగోడుతో పోల్చలేం అన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement