Friday, May 3, 2024

మెగా మెడికల్ క్యాంపు.. ప్రారంభించిన కేశినేని చిన్ని..

చిట్టినగర్, ప్రభ న్యూస్ : జిల్లా వ్యాప్తంగా ఎప్పటికీ పలు సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్న తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత కేసినేని ఫౌండేషన్ అధినేత కేసినేని శివనాద్ ఆధ్వర్యంలో మరో సేవా కార్యక్రమాన్ని నగరంలో నిర్వహించారు. కేశినేని చిన్ని ఆధ్వర్యంలో ఉచిత మెడికల్ క్యాంపు క్యాంపును శనివారం ఏర్పాటు చేశారు.

నగరంలోని వన్ టౌన్ చిట్టినగర్ మోతీ మసీద్ గ్రౌండ్ లో కేశినేని ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఈ మెడికల్ క్యాంపుlకు పెద్దఎత్తున హాజరైన వృద్ధులు, మహిళలు, వైద్య పరీక్షలు చేయించుకున్నారు. పలు విభాగాలకు చెందిన అత్యుత్తమ వైద్య నిపుణులు వీరికి పరీక్షలు నిర్వహించి ఉచితంగా మందులు పంపిణీ చేశారు. అంతకు ముందు ఎన్టీ రామారావు విగ్రహానికి పూలమాలలు వేసి నాయకులు ఘనంగా నివాళులర్పించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement