Thursday, May 2, 2024

Breaking: TDPలో చేరిన కన్నా లక్ష్మీనారాయణ

మాజీ మంత్రి కన్నా లక్ష్మీనారాయణ టీడీపీలో చేరారు. టీడీపీ కేంద్ర కార్యాలయం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు  సమక్షంలో ఆయన పార్టీ కండువా కప్పుకున్నారు. కన్నాకు కండువా కప్పిన చంద్రబాబు నాయుడు ఆయనను పార్టీలోకి ఆహ్వానించారు. కన్నాతో పాటు ఆయన అనుచరులు కూడా టీడీపీలో చేరారు. వారికి కూడా చంద్రబాబు కండువా  కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. అంతకుముందు కన్నా లక్ష్మీనారాయణ గుంటూరు కన్నా వారితోటలోని తన నివాసం నుంచి మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయం వరకు అనుచరులతో కలిసి కన్నా లక్ష్మీనారాయణ భారీ ర్యాలీ నిర్వహించారు. దాదాపు 3 వేల మంది ఈ ర్యాలీలో పాల్గొన్నారు. ఇక, సుదీర్ఘకాలం పాటు కాంగ్రెస్‌లో కొనసాగిన కన్నా లక్ష్మీనారాయణ.. ఉమ్మడి గుంటూరు జిల్లా నుంచి ఐదుసార్లు ఎమ్మెల్యేగా గెలుపొందారు. ఉమ్మడి ఏపీలో కోట్ల విజయభాస్కర రెడ్డి, నేదురుమల్లి జనార్దన్ రెడ్డి,  వైఎస్సార్, రోశయ్య, కిరణ్ కుమార్ రెడ్డి హయాంలో మంత్రిగా పనిచేశారు. కాపు సామాజిక వర్గంలో కీలక నేతగా ఉన్నారు. 

Advertisement

తాజా వార్తలు

Advertisement